చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అన్నానగర్లోని జీఎస్టీ ఆఫీస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు, మూడు అంతస్తులో మంటలు ఎగసిపడుతుండగా.. ఆరు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.