MBNR: బాత్రూంలో జారిపడి ఏనుగొండకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. యువకుడు బాత్రూంలో జారి పడగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యువకుడు మృతి చెందినట్లు వెల్లడించారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.