SS: మొహరం పండుగ సందర్భంగా చెట్లు నరకకుండా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పర్యావరణాన్ని, వృక్షాలను కాపాడుకోవడం అందరి బాధ్యతని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంప్రదాయ వృక్షాలను నరకడం వల్ల పర్యావరణ దుష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
వార్తలు
మొహరం సందర్భంగా చెట్లు నరకొద్దు: కలెక్టర్


