ప్రకాశం: పామూరు మండల నూతన తహసీల్దార్గా ఆనాటి లక్ష్మీ నారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
వార్తలు
పామూరు తహసీల్దార్గా ఆనాటి లక్ష్మీ నారాయణ


