తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు NDA కూటమికి మద్దతు తెలపడంతో టీఎంసీ పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో పార్టీ చీఫ్ విప్గా ఎంపీ కల్యాణ్ బెనర్జీని నియమించింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ సీఎం మమతా అధికారిక లేఖ రాశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని లేఖలో తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను చేపట్టాలని కోరారు.
వార్తలు
లోక్సభ స్పీకర్కు మమతా లేఖ!


