హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్

AP: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌(APL) 5వ సీజన్‌ ఇవాళ్టి నుంచి ఈనెల 30 వరకు జరగనుంది. 7 జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో మొత్తం 32 మ్యాచ్‌లు జరుగుతాయి. విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. ఈనెల 13 వరకు విశాఖలో మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌, కాకినాడ కింగ్స్‌ తలపడనున్నాయి.