KRNL: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తుగ్గలి పోలీసులు బుధవారం పెండెకల్లు రైల్వే స్టేషన్లో మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ పులిశేఖర్, ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో నాకాబంది చేపట్టారు. రైల్వే స్టేషన్లోని పార్సిల్ కార్యాలయంతో పాటు డెమో రైలులో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు.