ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం జీ. కొండూరు మండలం హెచ్. ముత్యాలంపాడు బ్రిడ్జి వద్ద రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో కలిసి వరద ఉధృతి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోలేవాల్ బ్రిడ్జిపై నుండి ప్రవాహం వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.