E.G: విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని, వారి భవిష్యత్తుకు 10వ తరగతి కీలక మలుపని జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి అన్నారు. శుక్రవారం గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రతిభకు ప్రేరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.