ATP: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనే యస్వామిని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పస్వామీ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేదపండితులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో రాతితో నిర్మించనున్న గర్భాలయం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు పాల్గొన్నారు.