E.G: జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా కంఠమణి రమేష్ బాబుని నియమిస్తూ పార్టీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కంటమణి రమేష్ బాబు కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యువతను సమాయత్తం చేయడంతో రమేష్ ను జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.