SKLM: కొత్తకుంకాం, కొండకుంకాం గ్రామాల్లో పలు చెరువుల గర్భాలను చదును చేసి మొక్కజొన్న, సరుగుడు, నీలగిరి మొక్కల పెంపకం చేపడుతున్నారు. వర్షాధారంపైనే సాగు చేసే ఈ ప్రాంత రైతులు, చెరువుల్లో నీటిని ఆయకట్టుకు మళ్లించి వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. ఒకప్పుడు నీటితో కళకళలాడే చెరువులు ఆక్రమణదారుల చెరలో పడి నేడు వెలవెలబోతున్నాయి.