PPM: జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ సహాయం పునరావాస కేంద్రాలో ఉన్నవారికి, మత్స్యకారులకు ఉచితంగా అందిస్తామన్నారు.