VSP: ఈ నెల 28, 29వ తేదీల్లో సుజాత నగర్లో సీపీఎం జిల్లా మహాసభలు జరగనున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.జగ్గునాయుడు తెలిపారు. బుధవారం జగదాంబలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 28న ఉదయం 10 గంటలకు పెందుర్తి జూనియర్ కళాశాల నుంచి సుజాత నగర్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభను ప్రజలు, కార్మికులు విజయవంతం చేయాలన్నారు.