కోనసీమ: అమలాపురం పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించబోయే అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ భవనం నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు , నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామాల్లో అన్ని వర్గాల వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు.