సత్యసాయి: పెనుకొండ మండలంలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇవాళ ప్రజలు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. వినతులు అందుకున్న వెంటనే అధికారులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.