VZM: ‘దిత్వా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.