VZM: కలెక్టరేట్ లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పు తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు.