W.G: ఉండి గ్రామ శివారు ప్రాంతంలో సోమవారం పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు. వారి వద్ద నుంచి 4,350 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూద క్రీడలను ప్రోత్సహించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.