VZM: ఉపాది హామీ పనులను ఉదయం 6.30 సరికే ప్రారంభించాలని బొబ్బిలి MPDO రవికుమార్ సూచించారు. ఇవాళ స్దానిక కాశిందొరవలస పంచాయతీలోని డొంగురు వలసలోఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలతల ప్రకారం పనులు చేయించి రోజు వేతనం రూ.307 వచ్చేలా పనులు చేపించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం తాగునీటి ట్యాంకును పరిశీలించారు.