అన్నమయ్య: క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె క్రీడాకారులకు సూచించారు.