విశాఖలోని కళాభారతి రోడ్డులో రబ్బానీ మిల్క్ పాయింట్ వద్ద రోడ్డు మార్జిన్ను ఆక్రమించారంటూ చిరు వ్యాపారులపై సోమవారం సచివాలయ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. శానిటేషన్ సిబ్బంది శ్రీనివాస్, గోపి, సూరిబాబు, రమేష్లు రోడ్డు మార్జిన్ను టచ్ చేశారంటూ వ్యాపారులు విక్రయిస్తున్న సామాగ్రిని (రుబ్బు) కింద పడేసి, ఫైన్లు విధించినట్లు చిరువ్యాపారులు పేర్కొన్నారు.