ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 9న హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విజయరాజు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారికి భక్తాదులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం ఉదయం 8 గంటలకు ఆలయ ఆవరణలో లెక్కింపు జరుగుతుందన్నారు.