KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాడా పీడీ వేణుగోపాలరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తామని చెప్పారు. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా అర్జీలు సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు.