PPM: విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.