అన్నమయ్య: రాయచోటి మదనపల్లి రింగ్ రోడ్పై సోమవారం తెల్లవారుజామున సీతాఫలాలతో లోడైన ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డుమధ్యలో పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ సీఐ కుళాయప్ప వెంటనే స్పందించి, ఆటోను రోడ్డుమీద నుంచి తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.