VSP: ప్లాస్టిక్ వాడి అనారోగ్యానికి గురి కావద్దని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ అన్నారు. బుధవారం ఈస్ట్ పాయింట్ కాలనీలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. డీఈవో మాట్లాడుతూ.. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కావున ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని చెప్పారు.