ATP: గార్లదిన్నె మండలం కల్లూరు-తాటిచెర్ల రైల్వే సెక్షన్ పరిధిలో రైల్వే ట్రాక్ మరమ్మత్తుల కారణంగా రేపటి నుంచి నాలుగు రోజులపాటు రైల్వే గేటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కావున కోటంక, పెనకచర్ల, పెనకచర్ల డాం మార్గం వెళ్లే వాహనదారులు గమనించవలసిందిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారి రవిబాబు విజ్ఞప్తి చేశారు.