ప్రకాశం: టంగుటూరు ఫ్లై ఓవర్ వద్ద 41 బస్తాల రేషన్ బియ్యంతో కావలి వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని దాడి చేసి పట్టుకున్నట్లు టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవన్నారు.