కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కావున ప్రజలు అర్జీల రూపంలో ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.