SKLM: పాతపట్నంలో వెలసియున్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శరన్నవరాత్రుల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.