కృష్ణా: ఘంటసాల గ్రామానికి చెందిన వేమూరి ప్రసాద్ రావు ఎంపీపీ వేమూరి రజినీ కుమారి దంపతుల కోడలు బండ్ల స్నేహ జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జి ఫలితాల్లో స్నేహ జిల్లా జడ్జిగా ఎంపికైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. స్నేహ జిల్లా జడ్జిగా ఎంపికవడం పట్ల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ప్రముఖులు మంగళవారం అభినందనలు తెలిపారు.