చిత్తూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ తుషార్ దూడి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నియంత్రణ వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా చిత్తూరు ప్రజలకు 24/7 రక్షణ అందించడమే జిల్లా పోలీసుల దృడ సంకల్పం అన్నారు.