PLD: ఫోరమ్ ఫర్ ఆర్టీఐ (FRTI) ఆధ్వర్యంలో త్వరలో పత్రికలు, యూట్యూబ్ ఛానెల్లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఆర్టీఐపై మరింత అవగాహన కల్పిస్తామని జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ప్రకటించారు. నరసరావుపేట మండలం ఇస్సాపాలెంలో సోమవారం జరిగిన పల్నాడు జిల్లా నూతన కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలన్నారు.