W.G: నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ ఎంఏ షరీఫ్, టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఆర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు.