అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన సిగి చెన్నయ్యను సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 6, 7 తేదీలలో కడపలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన హామీ ఇచ్చారు.