అన్నమయ్య: విధుల్లో ఉండగా ఆగస్టు 18న రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు బి. ఈశ్వర్ నాయక్ (HG–323) కుటుంబానికి జిల్లా ఎస్పీ ధీరజ్ శుక్రవారం రూ. 30 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ బాధిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.