KRNL: డ్రగ్స్, మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని DYFI జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర పిలుపునిచ్చారు. ఆదోనిలో డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించారు. యువత ఉపాధి లేక మత్తుపదార్థాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.