అన్నమయ్య: కుటుంబ సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్యకు ప్రయత్నించ ఘటన సోమవారం మదనపల్లి మండలంలో జరిగింది. CTM పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన గురుమూర్తి(65) కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది పొలం వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ICU విభాగంలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.