PLD: మంగళగిరి పానకాల స్వామిని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ, ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.