తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సులు సాంకేతిక సమస్యలతో మొరాయిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ నిర్వహణ లోపం, ఏసీ, బ్యాటరీ పనితీరు తగ్గడం, ప్రత్యామ్నాయ బస్సులు అందుబాటులో లేకపోవడం సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల నిర్వహణ లోపాలపై సమీక్షించేందుకు మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ ప్రతినిధి ఈనెల 26న తిరుపతికి రానున్నట్లు సమాచారం.