E.G: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులు సందర్భంగా 3వ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శించడం సంతోషంగా ఉందన్నారు.