శ్రీకాకుళం: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Tech 3, 5, 7వ సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి ఎస్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ. 250తో కలిపి మొత్తం రూ.1050లను 3, 5వ సెమిస్టర్కు ఈనెల 24లోపు 7వ సెమిస్టర్కు 17లోపు చెల్లించాలన్నారు.