BDK: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం చంద్రుగొండ మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.