BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల దంపతులు గురువారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం కొండపైన శివాలయాన్ని దర్శించుకున్నారు. వారికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.