పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించాలని, సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 అదనంగా పెంచుకోవాలని కోరినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.