దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 14 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలను రద్దయ్యాయి. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. బెంగళూరుకు రావాల్సిన 58, వెళ్లాల్సిన 63 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.