NZB: మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 40,000 జరిమానాను ఆర్మూర్ సెకండ్ క్లాస్ స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించారని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఎవరు మద్యం సేవించి వాహనలు నడపరాదన్నారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.