కాంబోడియా, థాయ్ల్యాండ్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తలు తలెత్తాయి. ప్రముఖ ఆలయం ఉన్న ప్రీహ్ విహార్ సమీపంలో కాంబోడియా గ్రెనేడ్ లాంచర్లతో దాడికి దిగింది. దీంతో థాయ్ల్యాండ్ వైమానిక దళాలు కాంబోడియా సరిహద్దులపై ఎదురుదాడులు చేస్తున్నాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఈ రెండు దేశాల మధ్య సీజ్ఫైర్ డీల్ను కుదిర్చిన విషయం తెలిసిందే.