HNK: పరకాల పట్టణ కేంద్రానికి చెందిన ఇద్దరు యువ వైద్యులు స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ.2.51 కోట్లు కోల్పోయారు. క్యూఆర్ కోడ్ ద్వారా పంపిన డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం రాగా..ఈ నెల 3న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో నష్టం జరగడంతో నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా విచారణ ప్రారంభించింది.